05/01/2023
మమఎర్త్ మరో పేటీఎం కాబోతోందా?
మమఎర్త్ (Mamaearth) వంటివాటిని తయారు చేస్తున్న హొనస కన్స్యూమర్ లిమిటెడ్ (Honasa Consumer Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్.
మమఎర్త్ (Mamaearth) వంటివాటిని తయారు చేస్తున్న హొనస కన్స్యూమర్ లిమిటెడ్ (Honasa Consumer Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు వెళ్ళడంతో ట్విటర్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది మరో పేటీఎం కాబోతోందని జోస్యం చెప్తున్నారు. పేటీఎం భారీ అంచనాలతో ఐపీఓకు వెళ్ళి చతికిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
హొనాస కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ కోసం కేపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI)కి దరఖాస్తు చేసింది.
ప్రమోటర్లు, మదుపరులు, ఇతర సెల్లింగ్ షేర్హోల్డర్ల ద్వారా 4,68,19,635 ఈక్విటీ షేర్స్ ఆఫర్-ఫర్-సేల్ (OFS) కాంపొనెంట్, దీనితోపాటు రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్స్ ఈ ఐపీఓలో ఉన్నట్లు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) చెప్తోంది.
నీరజ్ అరోరా అనే ట్విటర్ యూజర్ ఇచ్చిన ట్వీట్లో, 2022 జనవరిలో మమఎర్త్ లాస్ట్ వాల్యూయేషన్ 1.2 బిలియన్ డాలర్లు అని పేర్కొన్నారు.
ఈ కంపెనీ ఇప్పుడు రాబోయే తన ఐపీఓ కోసం 3 బిలియన్ డాలర్లు వాల్యుయేషన్ను కోరుతోందని, గత ఏడాది మమఎర్త్ లాభాలు రూ.22 కోట్లు అని, ఈ కంపెనీ తన టార్గెట్ వాల్యుయేషన్ వద్ద పబ్లిక్కు వెళ్తే, దాని లాభాలకు 1,000 రెట్లు విలువ కడతారని తెలిపారు.
ఉదాహరణకు, హెచ్యూఎల్ యొక్క గత ఏడాది లాభాలు రూ.9,000 కోట్లు అని, ఆ కంపెనీ వాల్యుయేషన్ పబ్లిక్ మార్కెట్లో రూ.6 లక్షల కోట్లు అని, 66 రెట్లు అని తెలిపారు.
శిల్పా శెట్టి 0.75 కోట్లు మమఎర్త్లో పెట్టుబడి పెట్టారని, ఈ కంపెనీ తన టార్గెట్ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు వద్ద పబ్లిక్కు వెళ్తే, శిల్పా శెట్టి పెట్టుబడి విలువ రూ.80 కోట్లు కావచ్చునని తెలిపారు.
ఓఎఫ్ఎస్లో షేర్స్ ఆఫర్ చేస్తున్నవారిలో ప్రమోటర్లు వరుణ్ అలఘ్, ఘజల్ అలఘ్, పెట్టుబడిదారులు ఫైర్సైడ్ వెంచర్స్ ఫండ్, సోఫినా, స్టెల్లారిస్, కుణాల్ బన్సల్, రోహిత్ బన్సల్, రిషభ్ హర్ష్ మరివాలా, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఉన్నారు.
శకటస్ హొమ్మ అనే ట్విటరాటీ స్పందిస్తూ, తన మాటలు గట్టిగా తగులుతాయన్నారు.
ప్రస్తుత ఐపీఓ వాల్యుయేషన్ వద్ద రిటెయిల్ ఇన్వెస్టర్ తన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి 100 సంవత్సరాలు పట్టవచ్చునని తెలిపారు.
మమఎర్త్కు తాను దూరంగా ఉంటానని, మిగిలినవారు కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
మరో యూజర్ స్పందిస్తూ, రూ.400 కోట్ల నిధుల సేకరణ వల్ల కంపెనీ లాభాలు రూ.240 కోట్లకు చేరుతాయని, నూటికి నూరు శాతం లాభాలను డివిడెండ్గా ఇస్తారని భావించినప్పటికీ, ద్రవ్యోల్బణం రేటు వద్ద స్టార్టప్ మరింత వృద్ధి చెందుతుందని భావించినప్పటికీ, అమాయక పెట్టుబడిదారు తన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి 100 సంవత్సరాలు (వాల్యుయేషన్ రూ.24,000 కోట్లు) పడుతుందని చెప్పారు.
మరో యూజర్ స్పందిస్తూ, ఐపీవో వాల్యుయేషన్ల కోసం ఇంత పిచ్చి ఎందుకో అర్థం కావడం లేదన్నారు. గతంలో పెట్టుబడి పెట్టిన పీఈ ఇన్వెస్టర్ల అభిప్రాయానికి విలువ ఇచ్చి ఉండవలసిందన్నారు.
పేటీఎం (Paytm) ఐపీఓ లిస్టింగ్ రోజునే చతికిలపడిన విషయాన్ని ట్విటరాటీలు గుర్తు చేస్తున్నారు. Mamaearth IPO కూడా అదే విధంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ఫ్లుయెన్సర్ విభోర్ వార్షణేయ్ ఇచ్చిన ట్వీట్లో, 2023 కోసం తన మొదటి తీర్మానం మమఎర్త్ ఐపీఓకు దరఖాస్తు చేయకూడదనేదేనని చెప్పారు. మరో పేటీఎం సిద్ధమవుతోందన్నారు.
వాల్యుయేషన్స్, ప్రైస్ బ్యాండ్ ఏదైనప్పటికీ, రూ.22 కోట్లు లాభాలు ఆర్జించిన కంపెనీ రూ.24 వేల కోట్ల వాల్యుయేషన్ కోరుతోందన్నారు.
మమఎర్త్ ఐపీఓను సబ్స్క్రైబ్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఆ ఐపీఓను సిఫారసు చేసే విశ్లేషకులు లేదా ఇన్వెస్ట్మెంట్ గురూస్, దీనిని ప్రమోట్ చేసే మీడియా నెంబర్ వన్ మోసగాళ్ళని అర్థం చేసుకోవాలని మరో ట్విటరాటీ చెప్పారు.
అలాంటివారిని భవిష్యత్తులో బాయ్కాట్ చేయాలని సలహా ఇచ్చారు.
FY22లో ఈ కంపెనీ రూ.14 కోట్లు నెట్ ఎర్నింగ్స్తో లాభదాయకతను చూపించిందని మరో ట్విటర్ యూజర్ చెప్పారు.
FY21లో రూ.1,332 కోట్లు నష్టాలు వచ్చాయన్నారు. FY20లో రూ.428 కోట్లు నష్టం వచ్చిందన్నారు. FY23 మొదటి అర్ధ సంవత్సరంలో రూ.4 కోట్లు నికర లాభాన్ని చూపించిందన్నారు.
ఇదిలావుండగా, ఉత్పాదక ఖర్చులను తగ్గించుకోవడం వల్ల లబ్ధి పొందుతున్నట్లు ఈ కంపెనీ డీఆర్హెచ్పీ తెలిపింది.
FY22లో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 3 పెర్సెంటేజ్ పాయింట్లకు పైగా మెరుగుపడినట్లు పేర్కొంది.