22/02/2023
బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ కేంద్రం సామాన్యులకు తీపి కబురు చెప్పింది. సొంతింటి కలను సాకారం చేసుకునేందకు వీలుగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి, కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. బడ్జెట్లో భాగంగా.. ఈ సారి పీఎం ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. క్రితం సారి బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజన కోసం కేవలం రూ.48 వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించగా.. ఈ సారి మాత్రం ఆ మొత్తాన్ని ఏకంగా 66 శాతం పెంచి.. రూ.79 వేల కోట్లు కేటాయించడం విశేషం. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతున్న వేళ .. ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కల్పించనుంది.