Challur Village

Challur Village Challur is a Village in Veenavanka Mandal in Karimnagar District of Telangana State, India, This is official page of Challur Village.

Challur is a Beautiful Village in Veenavanka Mandal in Karimnagar District of Andhra Pradesh State, India. It belongs to Telangana region. Telanagana is currently in the process of becoming a separate state. Challur Village will be part of Telangana State. It is located 27 KM towards East from District head quarters Karimnagar. 10 KM from Veenavanka. 171 KM from State capital Hyderabad. Challur Pi

n code is 505505 and postal head office is Ootur. Elbaka (4 KM), Bonthupalli (5 KM), Maddikunta (5 KM), Korkal (5 KM), Vegurupally (5 KM) are the nearby Villages to Challur. Challur is surrounded by Odela Mandal towards East , Sulthanabad Mandal towards North , Shankarapatnam Mandal towards South, Manakondur Mandal towards west. Karimnagar, Ramagundam, Warangal, Mancherial are the nearby Cities to Challur. Telugu is the Local Language here. Total population of Challur is 4565 .Males are 2293 and Females are 2,272 living in 1057 Houses. Total area of Challur is 1695 hectares. Karimnagar is the Nearest Town to Challur. Karimnagar is 29 km from Challur. Road connectivity is there from Karimnagar to Challur. Another nearest city is Jammikunta. There is a railway station in Jammikunta.

04/06/2014

Mana Etela Rajender gaaru minister ippudu mana huzurabad division abhivrudhi kavalani korukundamu... Mana Challur village chala baga develop kavalani aashisthunnanu. Etela Rajender gariki Challur prajala tharapuna shubhakankshalu...

07/05/2014

జిల్లాలో ప్రతి ఏటా తాగునీటి సమస్య తీవ్రమ వుతోంది. ఈసారి వర్షాలు కురిసినప్పటికీ పైపులైన్ విస్తరణ లేక, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు తాగునీరు అందించే పథకాలకు కరెంట్ లేక అన్ని ప్రాంతాలకు అందని దుస్థితి నెలకొంది. ఎస్సారెస్పీ కాలువలల్లేని ప్రాంతాల్లో చెరువులు నింపే పరిస్థితి లేదు. హుస్నాబాద్ నియోజకవర్గం, సిరిసిల్ల, మంథని డివిజన్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

వీణవంకలో ఐదు గ్రామాల్లో సమస్య ఉన్నట్లు నిర్ధా రించి 45 సోర్సుల ద్వారా రూ.7.86లక్షలు ఖర్చు చేసి సరఫరా చేయొచ్చని ప్రణాళికలో పొందుపరిచారు.

06/05/2014

సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే - స్థానికత ఆధారంగా విభజన జరగాల్సిందే - స్పష్టం చేసిన తెలంగాణవాదులు - తాజాగా సీఎస్ వ్యాఖ్యలపై మండిపాటు - మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో స్థానికత ఆధారంగా విభజన జరగాల్సిందే.. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కన్నుంచి వెళ్లిపోవాల్సిందే.. ఇన్నాళ్లు ఉద్యమం చేసింది, తెలంగాణ కోసం కొట్లాడిందీ అందుకోసమే. ఆప్షన్లు అసలే వద్దు.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.. అంటూ జిల్లాలోని తెలంగాణవాదులు టీ మీడియాతో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రకటించడంపై మండిపడుతున్నారు. ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. (టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో):ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు ఇస్తే తెలంగాణ కు తీరని అన్యాయం జరుగుతుందనీ, తెలంగాణలోనూ ఆంధ్రోళ్ల పాలనే కొనసాగుతుందని జిల్లా, రాష్ట్ర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇటీవల విభజనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్లు ఉం టాయని చెప్పడాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఆప్షన్లు ఇస్తే ఈ ప్రాంతం నుంచి వెళ్లే సీ మాంధ్ర ఉద్యోగుల సంఖ్య స్పల్పమని వాదిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణ స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వాపోతున్నారు. ఆప్షన్లు ఎలా ఇస్తారనేది ఈ నెల 8 వరకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తుండగా, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి స్పందించేందుకు టీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అక్కడా ఇక్కడా ఆంధ్ర పెత్తనమే.. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఆస్తులు, అ ప్పులు, భవనాలు ఉభయ రాష్ర్టాలకూ కేటాయిం చే ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఇక ఉద్యోగుల విభజన ఇపుడు కీలకంగా మారింది. ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రకటించడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యింది. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలనే ఆలోచనను తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్షన్లు ఇస్తేగనక ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనమే నడుస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లతో నిమిత్తం లేకుండా, స్థానికత ఆధారంగా విభజన జరగాలని పట్టుబడుతున్నారు. ఆప్షన్ల పేరుతో ఉభయ రా ష్ర్టాల ఉద్యోగుల మధ్య గందర గోళాన్ని సష్టిస్తున్నారని వాదిస్తున్నారు. విభజన ప్రారంభం కాకముందే ఆప్షన్లపై వ్యతిరేకత వ్యక్తం చేయాలని తె లంగాణ ఉద్యోగులు పట్టుపడుతున్నారు. తెలంగాణకు 42, సీమాంధ్రకు 58 శాతం చొప్పున జనా భా ప్రాతిపదికన, స్థానికత ఆధారంగానే విభజన ఉండాలని కోరుతున్నారు. ఆప్షన్లు ఇస్తే తెలంగాణ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లరని వారు స్పష్టం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఇప్పటికే రెండు విషయాల్లో అన్యాయం జరిగిందని, ఇక ని యామకాల విషయంలో కూడా అన్యాయం చే యాలని చూస్తే సహించలేమని, మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలంగాణ ఉద్యోగ సం ఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. నియామకాల్లోనే అన్యాయం.. సీమాంధ్ర ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో జరిపిన లాబీయింగ్, పక్షపాత వైఖరి కా రణంగా తెలంగాణ ఉద్యోగులకు ఆది నుంచే అ న్యాయమే జరిగిందని ఇక్కడి ఉద్యోగులు వాపోతున్నారు. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో 30 శాతం, రాష్ట్ర కేడర్‌లో 40 శాతం, జిల్లా స్థాయి కేడర్‌లో కేవలం 20 శాతం ఉద్యోగులను నియమించారని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ 20శాతంలోనూ మెరిట్ కోటా కింద మరో 20 శాతం మందిని సీమాంధ్ర ఉద్యోగులతో నింపార నే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత అన్యాయం జరిగినా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణ ప్రాంత ఉద్యోగుల గోడు వినిపించుకున్నవారు లేకుండాపోయారు. ఈ నేపథ్యంలోనే పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమం మహోద్యమమై స్వరాష్ర్టాన్ని సాధించుకుంది. ఇప్పుడు కూడా ఆప్షన్ల పేరిట నియామకాల విషయాన్ని మళ్లీ మొదటికి తేవాలని సీమాంధ్రకు చెం దిన ఉన్నతాధికారులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. ఆప్షన్లు ఉంటే మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇక్కడి నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లరని, వారి స్థానాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశాలుండవని, దీంతో కొత్త రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదని కూడా పలువురు తెలంగాణ ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. ఆప్షన్లుంటే ఎలా ఉంటాయి.. రాష్ట్ర పునర్విభన నేపథ్యంలో ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే ప్రధానంగా నాలుగు ఆప్షన్లు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చె బుతున్నారు. ఒక ప్రాంతంలో పని చేస్తూ విర మణకు ఐదేళ్ల సర్వీసున్న ఉద్యోగులకు ఏ రాష్ట్రం లో ఉండాలో నిర్ణయించుకునేందుకు మొదటి ఆప్షన్ ఇవ్వనున్నారు. భార్యాభర్తలు వేర్వేరు రాష్ర్టాలకు వెళ్లాల్సి వస్తే స్పౌస్ కింద ఇద్దరు ఒకే రాష్ట్రంలో పని చేసేలా ఇంకో ఆప్షన్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలో ని ర్ణయించుకునేందుకు మరో ఆప్షన్, వికలాంగుల కు ప్రాధాన్యతనిస్తూ చివరి ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్థానిక, జిల్లా, జోనల్ పోస్టులతో సంబంధం లేకుండా ఉద్యోగుల విభజన జరిగే అవకాశాలుంటాయని ఉద్యోగ సం ఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.

05/05/2014

12న మున్సిపల్, 13న పరిషత్,16న సార్వత్రిక ఫలితాలు -బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో 6309 మంది జాతకాలు -రోజులు లెక్కపెడుతున్న అభ్యర్థులు - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు 12, 13, 16.. ప్రస్తుతం అందరి చూపూ ఈ మూడు తేదీలపైనే నెలకొంది. మార్చి 30న మున్సిపోల్స్‌తో మొదలైన ఎన్నికల జాతర, ఏప్రిల్ 6,11లలో పరిషత్ ఎన్నికలతో వేడెక్కి, 30న సార్వత్రిక సమరంతో ముగియగా, 6309 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో వరుసగా మున్సిపల్, పరిషత్, జమిలి ఎన్నికల ఫలితాలు రానుండగా, అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -టీ మీడియా, కరీంనగర్ (టీ మీడియా, కరీంనగర్):మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11తేదీల్లో పరిషత్, 30న సార్వత్రిక ఎన్నికలు ముగియగా, ఆయాచోట్ల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో వెలువడనున్న ఫలితాలపై అందరి దష్టీ నెలకొంది. సుప్రీం జోక్యంతో ఫలితాలు వాయిదా.. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏప్రిల్ 2న ప్రకటిస్తామని వెల్లడించిన అధికారులు, ఆ తర్వాత 9కి వాయిదావేశారు. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత వారంలోగా ప్రకటించాల్సి ఉన్నా ప్రధాన రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఫలితాలు ప్రకటిస్తే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న వాటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ రెండు ఎన్నికల ఫలితాలను వాయిదా వేసింది. తుది విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాక, ఈ నెల 12, 13, 16 తేదీల్లో ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తేలనున్న 6309 మంది భవితవ్యం.. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో మొత్తం 236 డివిజన్లు/ వార్డులుండగా, 2166 మంది పోటీపడ్డారు. 57 జడ్పీటీసీ స్థానాలకుగాను 365 మంది, 804 ఎంపీటీసీ స్థానాలకు (817 స్థానాల్లో13 ఏకగ్రీవం) 3576 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 168 మంది, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలో 34 మంది పోటీపడ్డారు. మొత్తం మీద 6309 మంది భవితవ్యం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఫలితాలపై ఉత్కంఠ.. కాగా వరుస ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థులకు నెలరోజులుగా ఎదురుచూపులే మిగిలాయి. మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి. పరిషత్, సార్వత్రిక అభ్యర్థులూ రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న 12, 13, 16 తేదీలపై అందరి దష్టీ నెలకొంది. గెలిచేదెవరో, ఓడేదెవరో ఆయా రోజుల్లో తేలనుండగా, మున్సిపల్, జడ్పీ ఫలితాల తర్వాత రాజకీయం రసకందాయంలో పడనుంది. చైర్మన్లు, చైర్‌పర్సన్ల ఎన్నికలెప్పుడో?! మున్సిపల్, పరిషత్ ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు చైర్మన్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగాల్సి ఉంటుంది. 16న సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆ తర్వాత నిర్వహిస్తారా? ఆలోగానే పూర్తిచేస్తారా? అనేదానిపై స్పష్టత కరువైంది. ఎన్నికల సంఘం నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఫలితాల లోపు చైర్మన్లను ఎన్నుకుంటే కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముండదు. ప్రస్తుత ఎంపీలకు మాత్రం వారు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటేసే అవకాశం కల్పిస్తారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత చైర్మన్ల ఎన్నికలు జరిగితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటేసే అవకాశం ఉంటుంది. లెక్కింపు ఇక్కడ.. -కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఈవీఎంలను సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో భద్రపరిచారు. 12న ఇక్కడే ఓట్ల లెక్కింపు ఉంటుంది. రామగుండం కార్పొరేషన్‌కు సంబంధించి గోదావరిఖని నూతన మున్సిపల్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు.జమ్మికుంట, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును కరీంనగర్ మండలం చింతకుంట గురుకుల పాఠశాలలో, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల మున్సిపాలిటీల లెక్కింపును జగిత్యాల ప్రభుత్వ కళాశాలలో, పెద్దపల్లి నగరపంచాయతీ ఓట్ల లెక్కింపును రామగుండంలో చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. - పరిషత్ ఎన్నికలకు సంబంధించి, ఈ నెల 13న ఆయా డివిజన్ల పరిధిలో జరుగుతుంది. -సాధారణ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లిలోక్‌సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌లో చేపడతారు. ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరీంనగర్ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజవర్గాల లెక్కింపు సెయింట్ ఆల్పోన్స్ పాఠశాలలో, పెద్దపల్లి లోక్‌సభ స్థానం, పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపు ఉజ్వల పార్కు సమీపంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉంటుంది. ఈ మేరకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఆయా తేదీల కోసం అభ్యర్థులతోపాటూ ప్రజలూ ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

05/05/2014

సాధారణ ఎన్నికలు జరిగినా ఫలితాల వెల్లడి మే 16న ఉండడంతో రెండు వారాల టెన్షన్‌ను తగ్గించుకునేందుకు నేతలు యాత్రల బాట పట్టారు. జిల్లా లో ఎంపీ,ఎమ్మెల్యేలకు కలిపి 202 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఇందులో ప్రధాన పార్టీల నుంచి పోటీచేసి వారు ముఖ్యంగా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డవారు, ప్రస్తు తం యాత్రల్లో ఉన్నారు. ఓట్ల లెక్కింపునకు రెండురోజుల ముందు జిల్లా కేంద్రానికి చేరుకునేలా చూసుకున్నారు. కొందరు షిర్డీ, తిరుపతి లాంటి క్షేత్రాలకు వెళ్లగా, మరికొందరు విదేశాలకు వెళ్లారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతోపాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేసిన ప్రచారం ఫలితాలను ఇవ్వడంతో కలెక్టర్ వీరబ్రహ్మయ్య సహకరించిన ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు. ఆయన సతీసమేతంగా ఆదివారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ యాత్రకు వెళ్లారు. ప్రతి గురువారం భాగ్యనగర్ సాయి దేవాలయాన్ని తప్పకుండా సందర్శించే ప్రభాకర్, ఎన్నికలు పూర్తి కాగానే ఆదివారం షిర్డి పయనమయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి బీ.వినోద్‌కుమార్ ఆదివారం కరీంనగర్‌లో, బీజేపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌లో ఉన్నారు. సిరిసిల్ల అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి కేటీఆర్ దుబాయి పర్యటనలో ఉన్నారు. కోరుట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే.విద్యాసాగర్‌రావు సతీసమేతంగా షిర్డీకి వెళ్లారు. ఇదే నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డిరామ్‌లు, సురభీ భూంరావు హైదరాబాద్‌లో ఉన్నారు. చొప్పదండి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సుద్దాల దేవయ్య ఆదివారం ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి బొడిగె శోభ కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు వెళ్లగా, టీడీపీ అభ్యర్థి మేడిపల్లి సత్యం హైదరాబాద్ ఓయూలో స్నేహితులతో మకాం వేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మరోమారు ఇఫ్కో డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీకి వెళ్లారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్‌కుమార్ తన సొంత గ్రామమైన సింగాపురంలో మకాం వేశారు. మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ సిద్దిపేటలో ఉండగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ హైదరాబాద్‌కు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. జగిత్యాల టీడీపీ అభ్యర్థి ఎలగందుల రమణ వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నారు. ఆయన జగిత్యాలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ సోమవారం నుంచి ప్రాక్టీస్ కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. మానకొండూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్‌లో తన ఆసుపత్రిలో ఉన్నారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ, రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త కొట్టాల మోహన్‌రెడ్డి వద్ద ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావు హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆదివారం రాత్రి కరీంనగర్‌కు చేరుకున్నారు. ఆయన ఓట్ల లెక్కింపులోపు తిరుపతి పర్యటించే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు హైదరాబాద్‌లో ఉన్నా...

05/05/2014

(టీ మీడియా, కరీంనగర్ సిటీబ్యూరో):జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, జమ్మికుంట, చొప్పదండి మార్కెట్లలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా ఏ ఒక్క రైతుకు కూడా కనీస మద్దతు ధర దక్కడం లేదు. నాణ్యమైన ధాన్యానికి కూడా గిట్టుబాటు లభించడం లేదు. 2013- 14లో కనీస మద్దతు ధరగా ఏ గ్రేడు ధాన్యం క్వింటాల్‌కు 1,345, సాధారణ రకానికి 1,310 చొప్పున కొనాల్సి ఉంది. ఈ మార్కెట్ల లో కనీసం 1,300 కూడా చెల్లించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తెగ ఎండిన ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యానికి కూడా 1,285 కంటే ఎక్కువ ధర పెట్టడం లేదు. కనిష్ఠంగా 1,240 అంతకంటే తక్కువ ధర పెడుతున్న దళారులు ఇష్టముంటే ఇవ్వండి లేదంటే ఎత్తుకెళ్లండి.. అని కరాఖండిగా చెబుతున్నారు. దళారుల వైఖరి చూస్తున్న కొందరు రైతులు నష్టం భరిస్తూ తమ రెక్కల కష్టాన్ని ధారబోసి పోతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, జగిత్యాల, చొప్పదండి మార్కెట్లలో ఇప్పటి వరకు 47,073 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ మొత్తం మీద దాదాపు ఇప్పటికే 30 లక్షల వరకు దళారులు దండుకున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు, దళారులు చెల్లిస్తున్న ధరకు 90 నుంచి 60 వ రకు వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవట్లేదు. అయితే ఈ విషయాన్ని డీఎస్‌ఓ చంద్రప్రకాశ్ దష్టికి దీసుకెళ్లగా, విచారణ జరిపిస్తామన్నారు. అన్ని తీర్ల నష్టమే జరిగింది.. పంట చేతికి రావాలంటే రైతు కుటుంబం ఎండనకా, వాననకా ఆరుగాలం శ్రమించాల్సి ఉంటుం ది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి, కరెంటు కోతలతో 20 నుంచి 30 శాతం పం ట దెబ్బతింది. కూలీల కొరతతో వరి కోత యం త్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గతేడాది 1, 500కు గంట చొప్పున కోతలు నిర్వహించగా, అదిపుడు 2 వేల నుంచి 2,200లకు పెరిగిం ది. ఈ లెక్కచొప్పున ఇస్తామన్నా హార్వెస్టర్లు దొరకడం లేదు. ఇన్ని రకాలుగా నష్టపోతూ మా ర్కెట్‌కు తరలించిన ధాన్యానికి దళారుల రాజ్యం లో కనీస మద్దతు ధర లభించకపోవడం శోచనీయం. జాడలేని కొనుగోలు కేంద్రాలు.. పౌరసరఫరాల సంస్థ ఏజెన్సీగా వ్యవహరిస్తూ జిల్లాలో ప్రతి పంట కాలంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు జాడ లేవు. ఐకేపీ, సహకార వ్యవసాయ పరపతి సం ఘాలు (ప్యాక్స్), గిరిజన కార్పోరేషన్ ద్వారా ఈ సారి 617 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్‌ఓ చంద్రప్రకాశ్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. సమయానుకూలంగా కేంద్రాలు తెరిస్తే రైతులు ఇంతలా నష్టపోయేవారుకాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గత నెల మొదటి వారం నుంచే నాలుగు మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవల్సిన అధికారులు దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే పరిస్థితి మరోలా ఉం డేదని రైతులు అంటున్నారు. జిల్లాలో 13.25 మె ట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 20 శాతం పొరుగు జిల్లాల్లో విక్రయాలు జరుగుతాయని, 30 నుంచి 40 శాతం మిల్లర్లు కొనుగోలు చేస్తారని, మిగతా మొత్తాన్ని సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోల్లు జరుపుతామని డీఎస్‌ఓ చం ద్రప్రకాశ్ చెబుతున్నారు. ఆది, సోమవారాల్లో కొ నుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని డీఎస్‌ఓ తెలిపారు. కొనుగోలు కేంద్రాలు రంగ ప్రవేశం చేసేం త వరకూ మార్కెట్లలో దళారుల బహిరంగ దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు. ఎండవోసి పట్కచ్చినా ధర వెడ్తలేరు.. వరి కోసినంకా వడ్లు ఎండవోసి పట్కచ్చినా ధర వెడ్తలేరు. ఇట్టముంటే ఇయ్యిండ్రి.. ఇట్టంగాక పోతే ఎత్తుకపోండ్రని సేట్లు చెప్తన్రు. ఈడిదాక తెచ్చి మల్లింటికి ఎట్ల తీస్కపోవాల్నని ఎంతకో ఇంతకు ఈన్నే ఇచ్చిపోతన్నం. లాగోడి పైసలన్నా అచ్చెతట్టు లేవు.. - పెద్దిగారి ఎంకవ్వ, వెలిచాల, రామగుడు మండలం.. కరెంటు లేకనే నట్టపోతిమి.. మొన్నటిదాక కరెంటు లేక నట్టపోయినం. మల్ల రాళ్లవానతోని ఇంత నట్టమైంది. ఇపుడు సేట్లు సుకం దోసుకుంటన్రు. ఎట్ల సూ సినా మేమే నట్టపోతున్నం. కొనుగోలు కేంద్రాలు పెడ్తమని చెప్పుడేగానీ పెట్టుడు లేదు. వనోవట్టోఅని ఎంతత్తే అంతకు అమ్ముకుంటున్నం.. వడ్లు మంచిగున్నపుడు ధర సుకం మంచిగ వెట్టాలెగదా.. ఇదంతా సర్కారోళ్లు చూస్కోవలే. - బోనాల వెంకన్న, కమాన్‌పూర్, కరీంనగర్ మండలం గింత అన్నాళముంటదా..? పదమూడు వందలన్నా ఇయ్యిండ్రి సేటని ఎంత మొత్తుకున్నా నా మాట ఇనలే. 115 బస్తాల వడ్లు తెచ్చి అగ్గువకు ఇచ్చిన. ఇదేంది. 1,285కే తక్‌పట్టి ఇచ్చిండు. మమ్ములను పట్టించుకునెటోల్లు ఎవ్వలున్నరు. మహిళ సంఘపోల్లు సెంటర్వెడ్తరని బావుపెట్ల మస్తు మంది వడ్లు కుప్పలువోసిండ్రు. ఇయ్యల్లటి వరకు సెంటరు తెర్వలె. - బోనాల మల్లయ్య, కమాన్‌పూర్, కరీంనగర్ మండలం

05/05/2014

తెలంగాణ ఓట్లపై కోట్లలో పందాలు గట్టి పోటీ ఉన్న స్థానాలపైనే పందెంరాయుళ్ల కన్ను -బెట్టింగ్‌జోరు పెంచుతున్న క్రాస్‌ఓటింగ్.. -కొన్నిస్థానాలపై రూపాయికి 20రూపాయలు -హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న దందా - రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బందాలు
హైదరాబాద్, మే 4 (టీ మీడియా):దశాబ్దాల తెలంగాణ కల సాకారమైనవేళ అధికారంలోకి ఎవరు వస్తారన్న విషయంపై కోట్లలో బెట్టింగుల దందా నడుస్తున్నది. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు..? టీఆర్‌ఎస్ మెజార్టీ సాధిస్తుందా..? కాంగ్రెస్ గెలుస్తుందా..? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందా..? మంత్రులు, బడానేతలు ఓడిపోతారా? గెలుస్తారా? ఎంత మంది ఓడిపోనున్నారు..? అన్న అంశాలపై హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగులు సాగుతున్నాయి.

19/04/2014

Every Challur villager like this page...!!

we have to appreciate him.... (Y)
19/04/2014

we have to appreciate him.... (Y)

19/04/2014

Challur is a Village in Veenavanka Mandal in Karimnagar District of Telangana State, India, This is official page of Challur Village.

Address

Veenavanka Mandal
Karimnagar
505505

Alerts

Be the first to know and let us send you an email when Challur Village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share