12/08/2023
ఇది వెంకట్ ఊటుకూరి పోస్ట్
*****************"*******
7 సం . SC కాలనీ లో ఆగిపోయిన రామాలయానికి దాతల సహకారంతో సిమెంట్ , ఇసుక , ఇటుకలు ఇస్తాం మీరు labour ఖర్చులు చూసుకోండి , అగ్రీమెంట్ వ్రాసి .. దేవాలయం త్వరగా పూర్తి చేసి ... 90 కుటుంబాలకు ధర్మాన్ని దగ్గర చేద్దాం అనుకోవటమే తప్పా ...
సొంత అకౌంట్ కు ట్రస్ట్ అకౌంట్ కు తేడా తెలియదు ..
దానధర్మ సంస్థ income టాక్స్ 80G, 12A రూల్స్ ప్రకారం నడుస్తుంది ... మీరు చెప్పే రూల్స్ ప్రకారం కాదు ..ట్రస్ట్ నిబంధనలు ప్రకారం సహాయం అడిగే హక్కు ఉంది ...
7లక్షలు పని ఉంది - 3.5 కూలీలకు గ్రామస్థులు చూసుకోమని చెప్పాము అంగీకరించారు , 1.75 లక్షల మెటీరియల్ ఇప్పటికే 90 వేలు సామాను ( cash కాదు )
ఇచ్చాము.
ఇంకా పెయింటింగ్ 1.5-2 , ప్రతిష్ట ఉన్నాయి. 7 లక్షలు పై మాటే .
నా నోటికి వచ్చింది కాదు - మేస్త్రీలతో మాట్లాడి , గ్రామస్తుల దగ్గర అంగీకారం చేసుకొని , validate చేసి చెప్పాము ...
కనీసం ఇలాంటి విషయాలలో తప్పుడు ఆరోపణ చేస్తే ముందు...
మనిషితో మాట్లాడాలనే కనీస ధర్మం లేదు .. గ్రామస్తుల నుంచి వీడియోలు, అగ్గ్రిమెంట్ తీసుకొని, ఎంక్వయిరీ పూర్తి చేసి మొదలు పెట్టాం
దేవాలయం పూర్తి చెయ్యాలనే వారు అయితే ఇలా నోటి వచిన్నట్టు మాట్లాడరు .. ఎంతసేపు అహకారం, వారు చేస్తే గొప్ప .. మనం చేస్తే మాత్రం అక్రమం.
7 సం . ఆగిపోయిన దేవాలయానికి సహాయం చేయద్దు అనే right ఎవ్వరికి లేదు ... ఇప్పటికే అక్కడ ధర్మం నుంచి మారిపోతున్నారు .. దానికి భాద్యత గా తీసుకొని పని చేసాం.
దేశం కానీ దేశంలో , దాతలను అడిగి దేవాలయాలు -ధర్మం చేస్తే వీళ్ళకి ఎందుకు నొప్పి ...
జీతాలను ధర్మం కోసం సమాజం కోసం ఖర్చు పెట్టె వాళ్ల వెదవలుగా కనిపిస్తున్నారు . మీకు
పెద్ద పెద్ద సంస్థలు కుడా చేయలేని పనులు మేము చేయగలుగుతున్నాము అందుకే ఈ ఏడుపులు ..
ప్రతి రూపాయి జాగ్రత్తగా, సేవ ధర్మ కార్యక్రమాలు గత 8 సం . చేస్తున్నాం.
తప్పుడు ఆరోపణ చేస్తున్న వాళ్ళకి త్వరలో సమాధానం చెప్తాం ...
వీడియోలు , అగ్రీమెంట్ లెటర్ చుడండి .. ఇంకా కావాలి అంటే గ్రామస్తుల number కూడా ఇస్తాను ..నేను పెట్టిన దాంట్లో తప్పు ఉంటె అడగండి ...
********"********************************
SSF సమాధానం
ఈ దేవాలయం టీటీడీ నిధులతో 2017లో కడప జిల్లా చక్రాయపేట మండలం చిలేకంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రారంభించినది. గ్రామస్తులు సమరసత సేవా ఫౌండేషన్ మరియు టీటీడీ వారిని మాకు దేవాలయము లేదు కనుక మేము మా గ్రామంలో శ్రీ రాములవారి దేవాలయం నిర్మించుకొనుటకు ఆర్థిక సహాయం చేయగలరు అని అభ్యర్థించగా ఆ రోజులో టీటీడీ సమరసత సేవ ఫౌండేషన్ వారి అగ్రిమెంట్ ప్రకారంగా దేవాలయాన్ని ఐదు లక్షల రూపాయలతో నిర్మించుటకు మంజూరు చేయడమైనది . నిబంధనల ప్రకారము గ్రామస్తులు సొసైటీ ఆక్ట్ ప్రకారంగా సంఘాన్ని రిజిస్టర్ చేసుకుని భూమికి సంబంధించిన వివరాలు అనుమతులు అన్ని సేకరించి కమిటీతో వంద రూపాయల స్టాంపు. పేపర్ మీద అగ్రిమెంట్ చేయించడం జరిగింది. టీటీడీ నిబంధనల ప్రకారం మేము ఈ ఐదు లక్షల రూపాయలతో ఆరు నెలల్లో టీటీడీ వారు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం నిర్మించుకొని ప్రతిష్ట పూర్తి చేయగలవారము అని వారు అగ్రిమెంట్ చేశారు . అయినా గ్రామస్తులు చుట్టూ మండలంలోని దాతలు సహకరించి మరికొంత దాదాపు 500000 సహాయం చేశారు . 2017 నుండి అనేకమార్లు దేవాలయం పూర్తి చేయమని కాంట్రాక్టర్ తో దేవాలయం నిర్మాణం అగ్రిమెంటు ,గోపురం అగ్రిమెంట్ కూడా చేయించడం జరిగింది .అక్కడున్న గ్రామస్తులు భేదాభిప్రాయాలతో ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేశారు . ఇందులో ముందుగా శ్రీ రఘురామయ్య అనే వ్యక్తి నేతృత్వంలో పని జరిగింది. అతనిపైన ఆరోపణలతో పని ఆగిపోయింది మళ్లీ కరోనా తర్వాత శ్రీ బాల వెంకటేశ నేను పూర్తి చేస్తాను అని బాద్యత తీసుకొని కొంత ధన సేకరణ చేసి మళ్లీ ఆరోపణలతో మళ్ళీ అయిపోయింది . అయినా మేము గోపురము తర్వాత కట్టుకొందురు ముందు ప్రతిష్ట చేయండి అని విగ్రహాలు తెప్పించి ప్రతిష్ట కోసం 25 వేల రూపాయలు మంజూరు చేసి ఇంకను అవసరమైతే దాతల దగ్గర ఇప్పించగలమని లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఉన్నటువంటి ఆది జాంబవ పరియోజన ప్రముఖ శ్రీ నూకల రవీంద్ర గారు వారి స్వామి వారి దగ్గర నుంచి 30 వేల రూపాయలు నిధులు ఇప్పించడం జరిగింది అయితే ముహూర్తములు ఇప్పటికీ ఏడుసార్లు పెట్టించడం మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది దాతలకు సహాయం చేయమని మేము చెబితే (యాక్చువల్ గా ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధం అయినా దేవాలయం పూర్తి చేయుట కొరకు ఈ ప్రయత్నం చేయడం జరిగింది) ప్రజలందరూ దాతలు అక్కడ ఏమి చేసినా బూడిలో పోసిన పన్నీరు వృధా కనుక తిరస్కరించడం అయింది .సమరసతా సేవా ఫౌండేషన్ దగ్గర 2017లో గ్రామస్తులు ఇచ్చిన అర్జీ గ్రామ కమిటీ దేవాలయ కమిటీ చేసిన వంద రూపాయల స్టాంప్ పేపర్ పైన అగ్రిమెంటు వాళ్ల జాయింట్ అకౌంట్ లో జమ చేసిన నిధుల వివరాలు అనేకమార్లు ప్రతిష్ట కోసం వ్రాయించిన ముహూర్తం కాపీలు దేవాలయాన్ని పలుమార్లు నిర్మాణ దశలో సందర్శించిన ఫోటోలు ఎస్ఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీ తాళ్లూరి విష్ణు గారు కూడా సందర్శించి ఇచ్చిన సలహా ఫోటోలు అన్నీ ఉన్నాయి .అన్నీ కూడా పద్ధతి ప్రకారమే జరిగాయి ఎవరైనా ఎప్పుడైనా కడప కానీ విజయవాడ ఎస్ ఎస్ ఎఫ్ ఆఫీసులో గాని టీటీడీ ఆఫీస్ లో కానీ ఈ విషయాలు తనిఖీ చేసుకోవచ్చు.
ఇంకా !
వెంకట్ గారు ఆరోపించినట్లు లేక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లో కానీ నిజాలు లేవు సమరసత సేవ ఫౌండేషన్ దేవాలయ నిర్మాణానికి ప్రారంభించక ముందే అక్కడ ఉన్న 80 కుటుంబాల్లో ఇరవై కుటుంబాలు మతం మారి ఉన్నారు . రెండు వర్గాలకు రెండు చర్చిలు కూడా వెలిసి ఉన్నాయి .అందుకే అక్కడ టీటీడీ ,హెచ్ డి పి పి ,ఎస్ఎస్ఎఫ్ మతమార్పిడి నిరోధించి , 20 కుటుంబాలు కూడా పునరాగమం చేయాలని ఈ ప్రయత్నం .
ఆంధ్ర ప్రదేశ్ లో 502 దేవాలయాలు నిర్మాణం పూర్తి చేసుకున్న కేవలం అక్కడక్కడ ఒకటి అర మాత్రమే ఇలా గ్రామస్తుల సహకారం సమన్వయం ఐకమత్యం లేకపోవడం వల్ల అక్కడున్న కొందరు వ్యక్తిగత స్వార్థం లేదా స్వలాభం వలన ఇవి ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఒక దేవాలయం టీటీడీ వాళ్ళు ఇదే దానధర్మ ట్రస్ట్ జోక్యం వలన ఆపివేశారు. సీజ్ చేశారు .
మరియు గ్రామ దేవాలయానికి 7 లక్షల రూపాయల నిధులు అవసరం లేదు .ఇప్పటికే టీటీడీ, ప్రజలు,దాతలు ఇచ్చిన సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చుపెట్టి దేవాలయం పూర్తి చేశారు కేవలం గోపురం మాత్రమే ఉన్నది దాని కోసం సమరసత సేవ ఫౌండేషన్ 50000 లో నుంచి 25000 మరియు దాతల ద్వారా 30000 రూపాయలు ఇప్పించడం జరిగింది. ఆ సమయంలో ఆ కమిటీ వాళ్లు మేము 15 రోజుల లోపల ప్రతిష్ట పూర్తి చేస్తామని హామీ పత్రం రాసి ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ పని పూర్తి చేయక ప్రతిష్ట చేయలేదు. ఈ విషయంలో మాత్రమే వెంకట్ గారికి స్పష్టంగా రైటింగ్లో,పోస్టింగ్ ద్వారా గాని ఫేస్బుక్ మెసెంజర్ లో కాల్ ద్వారా గాని తెలియజేయడం జరిగింది . కానీ వారు ఏది పరిగణనలోకి తీసుకోకుండా ఏడు సంవత్సరాలుగా ఏం పీకుతున్నారు అక్కడ మతం మారుతుంటే ఏం చేస్తున్నారు అని అడ్డదిడ్డంగా తాను తన పరివారంతో కుసంస్కారంగా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ టిటిడి ,ఎండోమెంట్ ,పూజ్య పీఠాధిపతులు ,మఠాధిపతులు ,స్వామీజీలు ,ధర్మం పట్ల నిష్ఠ ఉన్నటువంటి పెద్దలు పని ఆదేశించిన పని భిన్నం కాకూడదని సమ్యమనముతో వివరించడం జరిగింది.
విజ్ఞులు ఆలోచించాలని సరైన పద్ధతిలో స్పందించాలని నిర్ధారించుకోవాలని ఈ పోస్టింగ్
అంతేకాకుండా ఈ విషయం ప్రశ్నించినందుకు సమరసత సేవా ఫౌండేషన్ ముఖ్యుల అకౌంట్లను బ్లాక్ చేయడం వలన తను మాత్ర మే పోస్టింగులు పెడుతుంటే ఇప్పుడు ఈ పబ్లిక్ పోస్టింగ్ పెట్టడం జరిగింది .
చర్చించాలి అవసరమైతే ముఖాముఖి కూర్చుని మాట్లాడాలి అంతేగాని నీకు ఇష్టం వచ్చింది నువ్వు రాసుకుంటూ పోతుంటే దాన్ని ప్రశ్నించకుండా బ్లాక్ చేస్తూ పోతుంటే ఎవరు ఊరుకోరు అని కూడా దానధర్మ టీంకు తెలియజేస్తున్నాం
మరి ఒక సారి విజ్ఞప్తి చేస్తున్నాము విజ్ఞతో వ్యవహరించాలని
ఇక్కడ అందరూ 40 సంవత్సరాలు గా హిందుత్వం కోసం పని చేసేవారు ఉన్నారు
పూర్తిగా తెలుసుకొని మాట్లాడగలరు